Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రాష్ట్ర చేనేత కార్మిక సంఘం నాయకున్ని పరామర్శించిన సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్

విశాలాంధ్ర -ధర్మవరం : సిపిఐ అనుబంధ సంస్థ అయిన ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి ఇటీవల అనారోగ్యముకు గురయ్యారు. కొన్ని రోజులుగా తిరుపతి ఓ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతున్నారు. అనంతరం 10 రోజుల క్రిందట ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. తదుపరి వారి బంధువుల ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ, ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ సోమవారం రాత్రి జింకా చలపతిని పరామర్శించారు. తదుపరి వారి ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వేమయ్య యాదవ్ మాట్లాడుతూ చేనేత పరిశ్రమను పరిరక్షించుటలో, చేనేత కార్మికులను ఆదుకొనుటలో ఎన్నో పోరాటాలను సల్ఫీ, ఇటీవలే చేనేత కార్మికులతో సమావేశం, తదుపరి దీక్షలు, అనంతరం చేనేత జౌళి శాఖ ఉన్నతాధికారులకు మెమోరాండం, ఇలా అలుపెరగన పోరాటం చేయడం వల్ల కొంత అనారోగ్య పాలు కావడం బాధాకరం. త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. చేనేత పరిశ్రమ, చేనేత కార్మికుల ను ఆదుకోవడంలో వారికి వారే సాటి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తిరుపతి నగర కార్యదర్శి విశ్వనాథ్ ,ఎస్టియు రాష్ట్ర నాయకుడు ధనుంజయ నాయుడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లం రాజేంద్రప్రసాద్, తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img