Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కామ్రేడ్ రాకెట్ల నారాయణరెడ్డి క్రికెట్ టోర్నమెంటుని ప్రారంభించిన జడ్పీ చైర్మన్, బోయ గిరిజమ్మ

విశాలాంధ్ర -ఉరవకొండ: ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, దివంగత కామ్రేడ్ రాకెట్ల నారాయణరెడ్డి మెమోరియల్ కప్‌ టెన్నిస్ బాల్ క్రికెట్‌ టోర్నీ మంగళవారం అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి జెడ్పి చైర్ పర్సన్ గిరిజమ్మ, పార్టీ యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు వై. ప్రణయ్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా నారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి గత నాలుగేళ్లుగా నియోజకవర్గ స్థాయిలో కామ్రేడ్ నారాయణరెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నీ నిర్వహించడం హర్ష నియమన్నారు. ప్రతి క్రీడాకారుడు క్రీడా స్ఫూర్తితో ఆడి, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సూచించారు. అనంతరం క్రికెట్ ఆడి టోర్నీని వారు ప్రారంభించారు.మొదటి బంతిని ప్రణయ్ రెడ్డి బౌలింగ్ చేయగా గిరిజమ్మ బ్యాటింగ్ చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, టోర్నమెంట్ నిర్వాహకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img