Friday, April 19, 2024
Friday, April 19, 2024

డిగ్రీ ప్రవేశాలు ప్రారంభం

విశాలాంధ్ర-తాడిపత్రి: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరమున కు ప్రవేశాలు ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. విజయ లక్ష్మీ చెప్పారు. శనివారం ప్రిన్సిపాల్ అధ్యాపక బృందముతో చిన్న పొలమడ పరిసర ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి అడ్మిషన్ల ప్రచారం చేశారు. విద్యార్థులకు కళాశాలలో బిఏ, బికామ్ జనరల్, బికామ్ కంప్యూటర్, బియస్సి (ఎంపిసి యస్), బియస్సి (బిజెడ్ సి ) కోర్సులు కలవన్నారు. అనుభవం, అర్హత కలిగిన అధ్యాపక బృందంచే విద్యా బోధన, సుదూర ప్రాంతము నుండి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కలదని వివరించారు. ఇంటర్ పాస్ అయిన వారు ఈనెల 10వ తేదీ లోగా కళాశాల కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ అడ్మిషన్ ప్రచారంలో అధ్యాపకులు డాక్టర్ విశ్వాసరావు, డాక్టర్ ఎన్.సవిత దేవి పాల్గొన్నారు. వివరాలకు ఈ క్రింది ఫోన్ నెంబర్లు సంప్రదించవలెను. 9290500488, 9949018368, 6301810254, 8074793679.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img