Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నూతన జడ్జ్ ఉమర్ ఫరూక్ కు సన్మానం చేసిన ధర్మవరం బార్ అసోసియేషన్

విశాలాంధ్ర ధర్మవరం:: గత నాలుగు సంవత్సరాలుగా ధర్మవరం కోర్టులో ఉమర్ ఫరూక్ న్యాయవాది వృత్తిని చేస్తూ ఇటీవలే నూతన జడ్జ్ ఉమర్ ఫరూక్ పదవి బాధ్యతలను చేపట్టబోతున్న సందర్భంగా ధర్మవరం కోర్ట్ బార్ అసోసియేషన్ వారు బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ చౌదరి, కార్యదర్శి దస్తగిరి,ఉపాధ్యక్షులు సుబ్బారావు మాట్లాడుతూ ఉమర్ ఫరూక్ న్యాయవాదై వృత్తిని చేస్తూ, తనదైన శైలిలోకక్షీ దారులకు న్యాయాన్ని చేకూరుస్తూ, కోర్టులో కూడా మంచి గుర్తింపు పొందా రనీ వారు తెలిపారు. ఉమర్ ఫరూక్ ఇష్టంతో కష్టపడి, లా విద్యలో మరింత ప్రావీణ్యతను చూపిస్తూ, ఇటీవల జడ్జ్ ఎగ్జామ్స్ లో ప్రతిభ ఘనపరిచి, ఎంపిక కావడం జరిగిందన్నారు. ఎన్నో సివిల్, క్రిమినల్ కేసులను వాదిస్తూ విజయాన్ని కూడా సాధించడం జరిగిందన్నారు. అనంతరం నూతన జడ్జిగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి మండలం మండలంలోని కోర్టులో పదవీ బాధ్యతలు గురువారం స్వీకరిస్తున్న సందర్భంగా బార్ అసోసియేషన్ తో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా ఉమర్ ఫరూక్ ను ఘనంగా సత్కరించుట, మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ధర్మవరం నుండి జడ్జిగా ఎంపిక కావడం కోర్టుకు ఎంతో గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులతో పాటు సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img