Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టులో ధర్మవరం క్రీడాకారులు.. జిల్లా కార్యదర్శి సూర్య ప్రకాష్

విశాలాంధ్ర- ధర్మవరం : హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టులో ధర్మవరం క్రీడాకారులు ఎంపిక కావడం జరిగిందని హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్, హాకీ సత్యసాయి జిల్లా కార్యదర్శి సూర్యప్రకాష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర జట్టులో ధర్మవరం క్రీడాకారులైన సి.ప్రశాంత్,డి. వెంకటేష్ నాయక్, డి. లోకేష్ ,ఎస్. మహమ్మద్ రఫీ ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈ క్రీడాకారులు ఈనెల 12వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఒడిస్సా రాష్ట్రంలోని రూర్కెలా లో జరుగుతున్న 13వ జాతీయ జూనియర్ మెన్ హాకీ ఛాంపియన్షిప్లో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ క్రీడాకారులను జాతీయస్థాయిలో కూడా బాగా రాణించి, మన జిల్లాకు, రాష్ట్రానికి, మరింత పేరు ప్రఖ్యాతులు తేవాలని వారు ఆశీస్సులను అందజేశారు. అదేవిధంగా ఈనెల 5వ తేదీ నుండి కాకినాడలో రాష్ట్ర జట్టుకు శిక్షణ శిబిరం కూడా మొదలు అయ్యిందని వారు తెలిపారు. ఈ ఎంపిక పట్ల సూర్య ప్రకాష్ తో పాటు అసోసియేషన్ ప్రతినిధులు బివి. శ్రీనివాసులు, బండి వేణుగోపాల్, పల్లె వేణుగోపాల్, ఉడుముల రామచంద్ర, గౌరీ ప్రసాద్, అంజన్న, జిల్లా హాకీ కోచ్ హసేన్ తో పాటు సీనియర్ క్రీడాకారులు కూడా హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img