Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విద్యార్థులకు అల్పాహారం పంపిణీ నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది

సాయికుమార్

విశాలాంధ్ర – ధర్మవరం: పట్టణంలోని సంజయ్ నగర్ లో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలకు పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీలకు సోమవారం సాయంత్రం అల్పాహారం దాతగా ఉంటూ తన చేతులు మీదుగా వారికి పంపిణీ చేయడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని దాత సాయికుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీలకు హెచ్ఎం రాంప్రసాద్ పాఠశాల కమిటీ ప్రతినిధి బై ముతక రమణ, ఉపాధ్యాయులు రామకృష్ణ నాయక్ చేతులు మీదుగా కూడా పంపిణీ చేశారు. అనంతరం హెచ్ఎం, బై మూతక రమణ మాట్లాడుతూ ఇప్పటికే ఈ పాఠశాల పదవ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రత్యేకమైన గుర్తింపు పొందిందని, ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు కూడా నిరంతరం విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. అన్ని దానాల కన్నా విద్యా దానం గొప్పదని, విద్యార్థినిలు అందరూ కూడా తల్లిదండ్రుల ఆశయాలను ఒమ్ము చేయకుండా ఇష్టపడి, కష్టపడి చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img