Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నులి పురుగుల నివారణ మందులు పంపిణీ

ఎంఈఓ సుధాకర్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని 1502 పాఠశాలలో మంగళవారం నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్భంగా వాటికి సంబంధించిన ఆల్బొనాడైజ్ టాబ్లెట్స్ ను పంపిణీ చేయడం జరిగిందని ఎంఈఓ సుధాకర్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని అన్ని యాజమాన్య పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ టాబ్లెట్లను పంపిణీ చేయడం జరిగిందని, ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. రూరల్ పరిధిలో 53 పాఠశాలలు అర్బన్ లో 47 పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు 52 మొత్తం వెరసి 29,832 మంది విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img