Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఐటిఐ కళాశాలకు ఫ్రిడ్జ్ వితరణ

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని మార్కెట్ యార్డ్ లో ఉన్న ప్రభుత్వ ఐటిఐ కళాశాలకు ఫయాజ్ భాష సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫయాజ్ భాష కూల్ వాటర్ ఫ్రిడ్జ్ బుధవారం వితరణ చేశారు. ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ లో ఐటిఐ కళాశాల విద్యార్థులు, మార్కెట్ యార్డు కు విచ్చేసే రైతులు, ఆర్టీవో కార్యాలయా నికి వచ్చే ప్రజలు వేసవికాలంలో త్రాగు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని కళాశాల విద్యార్థులు, ప్రిన్సిపల్ పి. ప్రసాద్ తమ దృష్టికి తెచ్చారు. దీంతో తమకు తోచినంత సహాయంగా దాదాపు 17వేల విలువచేసే 30 లీటర్ల నీటిని తక్షణ కూల్ వాటర్ ను అందించే ఫ్రిడ్జ్ ను అందజేశామన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పి. ప్రసాద్ మాట్లాడుతూ ఫయాజ్ సేవా ట్రస్ట్ పేదల కు చేస్తున్న సేవలను కొనియాడారు. వక్ బోర్డు అధ్యక్షుడు షాషావలి ఉపాధ్యక్షుడు వై. మహబూబ్ భాష, వైసిపి నాయకులు రియాజ్, చవ్వా రాజశేఖర్ రెడ్డి కళాశాల ఏటిఓస్ ఎం. రవి కుమార్, యస్. శాంత కుమారి, రత్నాకర్, రాంబాబు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img