Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రభుత్వ ఆసుపత్రికి సామాగ్రి వితరణ

ఎమ్మెల్యే వై.వి.ఆర్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్

విశాలాంధ్ర-గుంతకల్లు : రోగులకు సౌకర్యవంతంగా ఉండేందుకు బీరువాలు, టేబుల్స్, చేర్లు, బెడ్లు తదితర 18 రకాల పరికరాలు,సామాగ్రిని ఐఓసి సంస్థ ఏపీ తెలంగాణ జనరల్ మేనేజర్ ఆర్ .కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి 15లక్షల 44 వేలు విలువగల సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గుంతకల్లు ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు ఆయన చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆర్ కుమార్ మాట్లాడుతూ.. నూతనంగా గుంతకల్లు సమీపంలో ఐఓసి సంస్థ నిర్మించడం జరిగిందన్నారు. అయితే గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో సామాగ్రి పరికరాలు తక్కువగా ఉన్నందువల్ల వితరణ చేయడం జరిగిందని తెలిపారు. మరింత ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి ఐఓసీ సంస్థ ముందుంటుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ హరి ప్రసాద్ ,గుంతకల్లు ఐఓసీ మేనేజర్ నవీన్ ,గుంతకల్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్వీఆర్ మోహన్, గుంతకల్లు డిఎస్పి నరసింగప్ప ,డాక్టర్లు మల్లికార్జున రెడ్డి, రామాంజనేయులు, సుజాత, శ్రీకాంత్ రెడ్డి ,సంధ్యారెడ్డి ,అల్పాస్ ,ఉమామహేశ్వరి, అరుణ ,నాయకులు మండల కన్వీనర్ వాల్మీకి మోహన్, గోవింద నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img