Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

నేత్రదానం ఇరువురికి కంటి వెలుగుని ఇస్తుంది

యువర్ ఫౌండేషన్ ప్రతినిధులు

విశాలాంధ్ర ధర్మవరం:: నేత్రదానం అనేది ఇరువురికి కంటి వెలుగును ఇస్తుందని యువర్ ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు వైకే శ్రీనివాసులు, సున్కు సుకుమార్, కోశాధికారి రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు బుధవారం మాట్లాడుతూ ఈ యువర్స్ ఫౌండేషన్ సంస్థ 2015 లో ప్రారంభించబడి వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 170 కి పైగా నేత్రదానాలను స్వీకరించి, హైదరాబాద్ బంజారాహిల్స్ లో గల ప్రముఖ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వారికి నేత్రాలను ఇవ్వడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా పాఠశాలలకు, కళాశాలలకు, దేవాలయాలకు దాతల ద్వారా అనేక కార్యక్రమాలను కూడా చేపట్టడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇటీవలే అనంతపురంలో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి హైదరాబాద్ వారిచే కూడా సత్కార అభినందనలు కూడా పొందడం మాకెంతో గర్వంగా ఉందని తెలిపారు. నేత్రదానం చేయువారు సెల్ నెంబర్లు 9441184004 కు గాని 9440683100 కు సంప్రదిస్తే నేత్రాలను స్వీకరించడం జరుగుతుందన్నారు. కావున నేత్రదానంపై ప్రతి ఒక్కరు కూడా అవగాహన కల్పించుకొని మరో ఇరువురికి కంటి వెలుగును ప్రసాదించాలని వారు కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img