Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్బంగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి కణంపల్లి చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలను గుర్తించి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ ఇచ్చి సన్మానించడం జరిగింది అన్నారు. భారతీయ జనతా పార్టీ దళితుల పట్ల బడుగు బలహీన వర్గాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉందని తెలియజేశారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం ని అదేవిధంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ని నేడు ఉన్న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కి బడుగు బలహీన వర్గాలకు బిజెపి పార్టీ పెద్దపీట వేసింది. అదేవిధంగా బీసీ అయినటువంటి ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని అదేవిధంగా 27 మంది బీసీ కేంద్ర మంత్రులుగా ఉండడం భారత దేశ చరిత్రలో మొట్టమొదటిసారి అది కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమైందని సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విషయం అని ఆయన పేర్కొన్నారు. సబ్ కా సాత్,సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాష్, అని ఈ యొక్క సూత్రాన్ని కచ్చితంగా అమలు చేస్తుంది అని తెలియజేస్తూ డాక్టర్ బీర్ అంబేద్కర్ కి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సాకే శివశంకర్, మెడికల్ సెల్ రాష్ట్ర కోకన్వీనర్ డాక్టర్ కోనంకి శ్రీధర్, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముష్టూరు అంజిబాబు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ నాయక్, ఎస్సి మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్ట రాజా, జిల్లా కార్యదర్శి రామచంద్ర, రూరల్ మండల అధ్యక్షులు చైతన్య కిషోర్, గార్లదిన్నె మండల అధ్యక్షులు గోవిందు, శ్యామ్, గణేష్, ఈశ్వర్, మారెన్న, బాల విశ్వనాథ్, మురళి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img