Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రైళ్లలో జరిగే నేరాలపై డిఆర్ఎం సమీక్ష సమావేశం

విశాలాంధ్ర-గుంతకల్లు : తరచూ రైళ్లల్లో జరుగుతున్న నేరాలపై అదుపు చేసేందుకు శుక్రవారం గుంతకల్లు టిఆర్ఎం కార్యాలయంలో డిఆర్ఎం వెంకటరమణారెడ్డి,ఏ డి ఆర్ ఎం లు సూర్యనారాయణ, మురళీకృష్ణ ,రైల్వే ఎస్పి లు చౌడేశ్వరి, మురళి కృష్ణ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఎం వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రైళ్లలో జరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు జి ఆర్ పి పోలీసులు, ఆర్ పి ఎఫ్ పోలీసులు అనుసంధానంగా ఉంటూ నేరాలను అరికట్టేందుకు కృషి చేయాలని సూచించారు. నేరాలు ఎక్కడ ఎక్కువగా నమోదవుతున్నాయో అక్కడ గమనించి నేరస్తులను అదుపు చేయాలని వివరించారు. ఈ కార్యక్రమంలో జి ఆర్ పి ఎస్ పోలీసులు ,ఆర్పిఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img