Friday, April 19, 2024
Friday, April 19, 2024

దివ్యాంగులను విద్యలో ప్రోత్సహించాలి

విశాలాంధ్ర-రాప్తాడు : దివ్యాంగులను విద్యతోపాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని హెచ్ఎం నబీరసూల్ తెలిపారు. రాప్తాడు కేజీబీవీ పక్కన ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం దివ్యాంగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హెచ్ఎం మాట్లాడుతూ దివ్యాంగులు చదువుపై పట్టు సాధించేలా వారికనుగుణంగా విద్య నేర్పించాలన్నారు. ఉపాధ్యాయుడు రాజాకుల్లాయప్ప మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో రాస్ స్పెషల్ ఎడ్యుకేషన్ బీఈడి ఛాత్రోపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img