అనంతపూర్ జిల్లా, విశాలాంధ్ర-తాడిపత్రి : మొక్కలతోనే పర్యా వరణ పరిరక్షణ అని ఎంఈఓ నాగరాజు అన్నారు. గురువారము స్థానిక టైలర్స్ కాలనీలోని ఆర్పిజి పురపాలక ప్రైమరీ పాఠశాలలో నేస్తం ఫౌండేషన్ మహేంద్ర ఫైనాన్స్ ఆధ్యర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంఈఓ నాగరాజు హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆధునిక యుగంలో పర్యావరణాన్ని పరిరక్షించాలంటే మొక్కలను నాటడం ఒక్కటేనన్నారు. పర్యావర ణాన్ని హని చేసేటువంటి వాయువుల ఉద్ఘారాన్ని ప్రజలందరూ తగ్గించాలన్నారు. తద్వారా ఓజోన్ పొరను సంరక్షించిన వారమవుతామన్నారు. నేస్తం ఫౌండేషన్ కో- ఆర్డినేటర్ మీన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతగా మొక్కలను నాటడం తోపాటు వాటి సంరక్షణా బాధ్యతను తీసుకోవాలని, అప్పుడే వాతావరణ సమతుల్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు వరలక్ష్మి,అధిశేఖర్ రెడ్డి,వెంకటేశులు,అరుణ,సాయిలక్ష్మి,పద్మావతి,మహేంద్ర ఫైనాన్స్ ఉద్యోగులు ఇంద్రకరణ్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి, రామకృష్ణ, వెంకటేష్, ప్రశాంత్, తిప్పయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.