Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అనాధ పిల్లలకు కంటి పరీక్షలు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ మరియు ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా శుక్రవారం బత్తలపల్లి ఆర్ డి టి రురల్ డేవలప్మెంట్ ట్రస్ట్ మనోవికస కేంద్రం, మెదడు పక్షవాత కేంద్రం, హెచ్ ఐ వి,ఎయిడ్స్ బాధిత చిన్నారులకు, అనాథ పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. మొత్తం 3 సెంటర్స్ లో 90 మంది కి కంటి పరిక్షలు నిర్వహించడం జరిగింది.14 మంది పిల్లలకు కంటి అద్దాలు అవసరమని,7 మంది ని హయ్యర్ ఇన్స్టిట్యూట్ కు రెపర్ చేయడం జరిగిందని 1 ఒకరికి సర్జరీ అవసరం అని గుర్తించడం జరిగింది. ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు ఉచితంగా కళ్ళజోడును అందిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి జిబి విశ్వనాథ, ఎల్ వి ప్రసాద్ కోఆర్డినేటర్ ఎం.డి రఫిక్ , రెడ్ క్రాస్ కోఆర్డినేట్ బి . రమేష్,సెంటర్స్ ఇంచార్జి సిస్టర్ అగ్నిస్,సిస్టర్ కథరిన, సిస్టర్ సమత, టెక్నిషియన్లు రఫిక్, ఆర్ డి టి సిబ్బంది,విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img