Friday, April 19, 2024
Friday, April 19, 2024

మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి

విశాలాంధ్ర – ధర్మవరం: పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నర్సింహారెడ్డి పట్టపర్రుల ఎమ్మెల్యే నియోజకవర్గ అభ్యర్థి పోతుల నాగరాజు అను ఇరువురిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఏఐ ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జూన్సన్ బాబు,మాజీ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మధు తెలిపారు. అనంతరం వీరు సోమవారం నాడు ధర్మవరం లో గల శ్రీసాయి డిగ్రీ కళాశాల , వాసవి బాలికలకళాశాల,వాసవి బాలుర కళాశాల, జీవన జ్యోతి స్కూల్, జీవానంద స్కూల్, వివేకానంద డిగ్రీ కళాశాల, గాయత్రి స్కూల్, సాయికృప డిగ్రీ కళాశాల, సత్యకృప మహిళా డిగ్రీ కళాశాలుల్లో కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం చేయడం జరిగింది ,
ఈ కార్యక్రమం లో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజా, జిల్లా ఏఐఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు పోతలయ్య, ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గం అధ్యక్షులు శివ, నాయకులు మేడాపురం అభి, మురళి, కుమార్, ఉపేంద్ర, కిషోర్, విజయ్, నవీన్, రాము తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img