Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మురుగనీటి లీకేజీని పరిష్కరించండి

విశాలాంధ్ర-తాడిపత్రి:పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో అండర్ డ్రైనేజీ లీకై కాలనీ అంతా మురుగునీటి మయమవుతోందని ఆ కాలనీ ప్రజలు వాపోతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ అధికారులు ఇంటి పన్నులు, కొళాయి పన్నులు వసూలు మీద ఉన్న శ్రద్ధ
అండర్ డ్రైనేజీ మురుగు నీటి లీకేజీ పై మురుగునీరు సమస్యలపై లేదా అన్నారు. ఈ మురుగునీటి నిల్వ ఉండడం దుర్వాసనతో దోమలు ఉత్పన్నమై కాలనీలోని మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు, మెదడువాపు లాంటి వ్యాధులు వస్తూ ఉన్నాయన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు అండర్ డ్రైనేజ్ మురుగునీటి లీకేజీని మరమ్మతులు చేయించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img