Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి పై మాట్లాడే పద్ధతి నేర్చుకోవాలి

బిజెపి నాయకులు

విశాలాంధ్ర – ధర్మవరం : మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పై మాట్లాడేటప్పుడు సరైన పద్ధతిలో జాగ్రత్తగా మాట్లాడాలని బిజెపి నాయకులు చిగిచెర్ల అరవింద్ రెడ్డి, తుంపర్తి పరమేష్, గొట్లుర్ చంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మంగళవారం మాజీ ఎమ్మెల్యే సూరి వ్యక్తిగత కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ మా నాయకుడు వరదాపురం సూరి పై టిడిపి రాష్ట్ర కార్యదర్శి గోనుగుంట్ల విజయ్ కుమార్ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. గతంలో విజయ్ కుమార్ టిడిపి అని చెప్పుకుంటూ వైసీపీకి మద్దతు ఇవ్వడం వాస్తవము కాదా అని వారు ప్రశ్నించారు. నేడు ధర్మవరం ప్రశాంతంగా ఉందని, ఇలాంటి సమయంలో మళ్లీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు. అంతేకాకుండా చదువుకునే వ్యక్తి కూడా అసభ్యకరంగా మాట్లాడడం ఏంటి అని అది సిగ్గుచేటు కాదా అని వారు ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే అధికార పార్టీ నాయకులు చేస్తున్న భూ కబ్జాల గురించి మాట్లాడితే బాగుంటుందని వారు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాప్తాటి రాము, బొడగల గిరిధర్, చిలకం సూర్యనారాయణ రెడ్డి, నిరంజన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img