Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఘనంగా జరిగిన గణపతి సచ్చిదానంద స్వామీజీ జన్మదిన వేడుకలు.. ట్రస్ట్ సభ్యులు

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయంలోనూ, అదేవిధంగా ఎన్టీఆర్ సర్కిల్లో గల పాండురంగ స్వామి దేవాలయంలో శుక్రవారం నాడు గణపతి సచ్చిదానంద స్వామీజీ 81వ జన్మదిన వేడుకలు ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకులు శంకర సంజీవులు, సాగా సురేష్, ఊకా నాగరాజు, నాగేంద్ర, కుల్లాయప్ప, దత్త సేవలు మాట్లాడుతూ స్వామివారి జన్మదిన వేడుకలు రెండు చోట్ల నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. తొలుత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి వివిధ పూజలతో పాటు క్షీరాభిషేకములు నిర్వహించారు. అనంతరం గురుపాద, అష్టోత్తర పూజ, అనగాష్టమి వ్రతం కూడా అర్చకులచే వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ నిర్వహించారు. తదుపరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో 200 మందికి అన్నదానం, తదుపరి పాండురంగ స్వామి గుడిలో వెయ్యి మందికి, ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు కూడా అన్నదానం నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. తదుపరి మధ్యాహ్నం బాటసారులకు ప్రజలకు మజ్జిగ పంపిణీ కూడా నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. ఈ జన్మదిన వేడుకలను ఒక పండుగ వాతావరణముగా చేసి, విజయవంతం చేసిన అందరికీ కూడా ట్రస్టు సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img