Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బ్లడ్ క్యాన్సర్ కు గురైన చిన్నారికి మరో జన్మ ప్రసాదించండి

విశాలాంధ్ర-తాడిపత్రి: బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి షబీరాకు దానం చేసి మరో జన్మ ప్రసాదించాలని ఫయాజ్ భాషా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫయాజ్ భాష విజ్ఞప్తి చేశాడు. పట్టణంలోని చిన్న బజార్ లో ఉన్న ఐదో నెంబర్ ఫ్యాక్టరీలో శనివారం ఫయాజ్ భాష సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు ఫయాజ్ భాష బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారికి 25 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని నందలపాడు సన్యాసయ్య మఠం కాలనీకి చెందిన హాజీ భాష కుమార్తె 9 సంవత్సరాల చిన్నారి షబీరాకు దాదాపు ఎనిమిది నెలల నుండి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ ఉన్నది. వీరి కుటుంబం పేద కుటుంబం అయినప్పటికీ వారి దగ్గర ఉన్న ఆర్థిక స్తోమతతో బ్లడ్ క్యాన్సర్ కు వైద్యం చేయించారు. కానీ మెరుగైన చికిత్స కోసం బెంగళూరు సెయింట్ జాన్ హాస్పిటల్ లో చేర్చారు. ఈ హాస్పిటల్ లో వైద్యం ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ఈ పాపకు వ్యాధి నయం కావాలంటే దాదాపు 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. కానీ ఈ పాప కుటుంబ సభ్యులు అంత స్తోమత లేకపోవడంతో దాతల కోసం ఎదురుచూస్తున్నారని అదే కాలనీకి చెందిన తమ వక్ బోర్డ్ సభ్యుడు ఒకరు తనకు సమాచారం తెలియజేశారు. దీంతో ట్రస్టు ద్వారా తనకు చేతనైనంత సహాయం అందజేశానన్నారు. ఇంకా ఎవరైనా దాతలు ఈ పాపకు సహాయం చేయాలని కోరారు. ఎవరైన సహాయం చేయాలనుకునేవారు ఫోన్ పే నెంబర్: 9398793723కు ఆర్థిక సహాయం అందజేయవలసిందిగా కోరారు. వక్ బోర్డ్ ప్రెసిడెంట్ షాషావలి వైస్ ప్రెసిడెంట్ వై. మహబూబ్ బాషా డైరెక్టర్ డైరెక్టర్ ఎస్ ఎన్ ఆలీబాబా వైసిపి నాయకులు చవ్వా రాజశేఖర్ రెడ్డి, ఉమ్మడి గురు ప్రసాద్ రెడ్డి, రియాజ్, కొడవండ్లపల్లి వలి, ఆగిరిప్ప పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img