Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విధిగా అందిస్తాం

ఎమ్మెల్యే సోదరుడు వెంకటకృష్ణారెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విధిగా అందించడమే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి యొక్క ముఖ్యమైన డే యమని వారి సోదరుడు వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం పట్టణంలోని 27వ వార్డులో వారు ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తదుపరి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొని రాగా స్పందించిన వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తానని వారు తెలిపారు. ఇప్పటికే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని వారు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం చేసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క కృషి మరువలేనిద నితెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఇంచార్జ్ డోలా రాజారెడ్డి, సచివాలయ సిబ్బంది వాలంటీర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img