Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాష్ట్ర హాకీ జట్టు ఎంపిక పట్ల హర్షం.. హాకీ క్రీడాకారులు

విశాలాంధ్ర – ధర్మవరం : రాష్ట్ర హాకీ జట్టుకు క్రీడాకారుల ఎంపిక నిర్వహించడం జరిగిందని, ఇందులో శ్రీ సత్య సాయి జిల్లా నుంచి మహిళా జట్టుకు ఎం. అఖిల- ధర్మవరం, పావని- చిగిచెర్ల కాగా, పురుషుల జట్టుకు కె. ఈశ్వర్ ఎంపిక కావడం జరిగిందని హాకీ సీనియర్ క్రీడాకారులు బివి. శ్రీనివాసులు, బండి వేణుగోపాల్, పళ్లెం వేణుగోపాల్, డి.సూర్య ప్రకాష్ ,ఉడుముల రామచంద్ర ,సీనియర్ క్రీడాకారులు అభినందన శుభాకాంక్షలు శుక్రవారం తెలియజేశారు. జాతీయస్థాయి హాకీ పోటీలు ఎంపికైన వారికి ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని రామనంతపురంలో నిర్వహించబడుతాయని వారు తెలిపారు. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ శ్రీ సత్య సాయి జిల్లా వారు ధర్మవరంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని జగన్నాథ్ రెడ్డి ప్రారంభిం చారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి రోజు యోగా, స్లైకింగ్, వాకింగ్ లాంటి వ్యాయామాలు చేయడం వలన ఆరోగ్యవంతులు అవుతారని తెలిపారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబంతో పాటు ఆరోగ్యంగా ఉంటూ ఆర్థికంగా మెరుగుపడతారని తెలిపారు. నేడు మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాలలో ముందంజలో ఉన్నారని అదే విధంగా ఆరోగ్య విషయంలో కూడా ఉండాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img