Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భవిష్యత్తులో విద్యార్థినీలపై సంఘటనలు జరక్కుండా చూస్తామని హెచ్ఎం హామీ..

సావిత్రిబాయి పూలే మహిళా సంఘం వ్యవస్థాపకురాలు భారతి

విశాలాంధ్ర-గుంతకల్లు : భవిష్యత్తులో విద్యార్థినీలపై సంఘటనలు జరక్కుండా చూస్తామని హెచ్ఎం హామీ ఇచ్చినట్లు సావిత్రిబాయి పూలే మహిళా సంఘం వ్యవస్థాపకురాలు భారతి పత్రికా ప్రకటనలో తెలిపారు. సోమవారం పట్టణంలోని సావిత్రిబాయి పూలే సంఘం కార్యలయంలో భారతి మాట్లాడుతూ…30 తేదీల్లో స్థానిక హెచ్ జే పి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల గురించి ప్రచురించిన సంఘటనకు హెచ్ఎం సావిత్రమ్మ ఉపాధ్యాయులు స్పందించి ఈ ఘటన గురించి వన్ టౌన్ సిఐ తెలిసిందే ఈ సంఘటనపై పట్టణ సీఐ పిలుపుమేరకు పాఠశాల ఉపాధ్యాయులు, మహిళా సంగం సభ్యులందరూ స్టేషన్కు హాజరయ్యామని అన్నారు. ఈనెల మూడో తేదీన సీఐ పత్రికా ప్రకటనలోని నిజా నిజాలు విచారణ చేసుకొని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. ఉపాధ్యాయులపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరుతం కాకుండా తగు చర్యలు తీసుకుంటామని హెచ్ఎం పిల్లల తల్లిదండ్రులకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా హెచ్ఎం మా సంఘం వారికి సమావేశాలకు హాజరై విద్యార్థి విద్యార్థినీలకు తగిన సూచనలు ఇవ్వాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img