Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గృహ నిర్మాణాలు వేగవంతంగా పూర్తి కావాలి: ఆర్డీఓ హేమలత

విశాలాంధ్ర – సీతానగరం : గృహనిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని పార్వతీపురం రెవిన్యూ డివిజనల్ అధికారి, పార్వతీపురం డివిజన్ గృహ నిర్మాణ ప్రత్యేక అధికారి కె. హేమలత అన్నారు. శుక్రవారం మండలంలోని జోగిపేట జగనన్న కాలనీ లే అవుట్ ను ఆమె తనిఖీచేశారు. 24గృహాల్లో ఆరు గృహాలు నిర్మాణం పూర్తికావడం, మిగిలిన గృహాలు వివిధ దశలలో ఉండటాన్ని గమనించారు. ఏప్రిల్ 15నాటికి గృహ నిర్మాణాలు పూర్తిచేయాలని ఆమె స్పష్టం చేశారు. లబ్దిదారులను మరింత అవగాహన చేయాలని, త్వరగా నిర్మాణాలు చేయుటకు అన్ని విధాలా సహకరించాలని ఆదేశించారు. మౌళిక సదుపాయాల కల్పనకు జిల్లా కలెక్టర్ పనులు మంజూరు చేసిన మేరకు పనులు పూర్తి చేయాలని ఆమె పేర్కొన్నారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గృహ నిర్మాణాలు సకాలంలో పూర్తి చేసి ఆదర్శంగా నిలవాలని ఆమె తెలిపారు. వచ్చే మూడువారాల్లో అన్నిగృహాలు పూర్తి కావాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ సింహాచలం, సెక్రటరీ కిరణ్, గృహ నిర్మాణశాఖ అధికారి జానకీరాం, పప్పల కృష్ణ, ఇంజినీరింగ్ అసిస్టెంట్ చందన, వాలంటీర్లు పాల్గొని ఆమెకు లక్ష్యాలు నెరవేర్చడానికి కృషి చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img