Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

హోరాహోరీగా ఎన్టీఆర్ శతజయంతి క్రికెట్ పోటీలు

విశాలాంధ్ర – పెనుకొండ : పెనుకొండ నియోజకవర్గం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహకా కార్యదర్శి శ్రీమతి సవితమ్మ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ కప్పు భాగంగా ఇందులో 50 టీములు తలపడుతున్నాయి
13 వ రోజు బుధవారం ఉదయం కురుభవాండ్లపల్లి టీమ్ మరియు సోమందేపల్లి టీం లు తలపడ్డాయి. మొదటి బ్యాటింగ్ ఎంచుకున్న కురుభవాండ్లపల్లి టీం 16 ఓవర్ లో 127 పరుగులు చేయగా అనంతరం సోమందేపల్లి టీం 14 ఓవర్లలో 85 పరుగులు చేసి అల్ ఔట్ అయ్యారు .కురుభవాండ్లపల్లి టీం విజయం సాధించింది. మధ్యాహ్నం వెంకటరెడ్డి పల్లి మరియు నాగినాయన చెరువు గ్రామం టీంలు తలపడగా మొదట బ్యాటింగ్ ఎంచుకున్న నాగినాయనచెరువు టీం 16 ఓవర్ల 96 పనులు పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యారు అనంతరం వెంకటరెడ్డి పల్లి టీం 12 ఓవర్ల 97 రన్నులు చేసి విజయం సాధించారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందచేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహకా కార్యదర్శి శ్రీమతి సవితమ్మ ఆంజనేయులు మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు త్రివేంద్ర నాయుడు బాబుల్ రెడ్డి వీరచిన్న బుసప్ప మరియు టీం ఆర్గనైజర్ ర్లు తదితరులు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img