Friday, April 26, 2024
Friday, April 26, 2024

కొండ రోడ్డు ప్రారంభోత్సవం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ కొండ రోడ్డును శనివారం స్థానిక శాసనసభ్యులు శంకర్ నారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, మరియు సబ్ కలెక్టర్ కార్తీక్ ,మరియు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి ప్రారంభించారు ఈ రోడ్డు ఆరు కిలోమీటర్ల పొడవు గల 14 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు ఈ రోడ్డు నిర్మించడం వలన కొండపైన వెలసిన ఘనగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయ నిర్మాణ పనులు చేయడానికి ఇస్కాన్ వారు ప్రభుత్వానికి మూడు ప్రతిపాదనలు పంపారు ఒకటి రోడ్డు రెండు విద్యుత్తు మూడు నీరు ఈ మూడు అందుబాటులో ఉంచితే ఇస్కాన్ వారి నుంచి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నిర్మాణము మరియు ఇతర నిర్మాణాలు చేయడానికి వీలుగా ఉంటుందని అందువలన రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి ఈ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని శంకర్ నారాయణ తెలిపారు ఈ రోడ్డు నిర్మాణం పూర్తి అయినందున ఇక్కడ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ప్రతిపక్ష నాయకులు నియోజకవర్గంలో అభివృద్ధి చెందలేదని మా ప్రభుత్వంలోని అనేక అభివృద్ధి పనులు జరిగాయని సెల్ఫీలు దిగుతూ శునకానందం పొందుతున్నారని ఇంకా నగర పంచాయతీ పరిధిలో త్రాగునీటి కోసం అనేక నిధులు కేటాయించామని నిర్మాణ పనులు జరుగుతున్నాయని ప్రతిపక్ష నాయకులు కళ్ళు బొల్లి మాటలు మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తున్నారని ప్రజలు చాలా తెలివైన వారిని చేసిన అభివృద్ధి పనులను గుర్తుంచుకుంటారని ప్రతిపక్ష నాయకులకు చురుకలు అంటించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గీత రామ్మోహన్ రెడ్డి నగర పంచాయతీ చైర్మన్ ఉమర్, వైశాలి నందిని రెడ్డి ,సునీల్ , నయీముల, చీఫ్ ఇంజనీర్, ఇంజనీరింగ్ అధికారులు ఓబుల్ రెడ్డి, నాగరాజు, సంజీవయ్య, శివకుమార్, కౌన్సిలర్లు వైసిపి నాయకులు పాల్గొన్నారు,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img