Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

లక్ష్మినరసింహస్వామి దేవస్థానం ఆదాయం.10,51,905రూపాయలు

విశాలాంధ్ర – వలేటివారిపాలెం : మండలంలోని మాలకొండ శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహ స్వామిదేవస్థానంను దర్చించుకొనుటకు రాష్ట్రం నలుమూలలనుంచి భక్తులుఅధిక సంఖ్యలో తరలివచ్చి తమ మొక్కలు తీర్చుకొన్నారు.దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు ఈ రోజు భక్తులద్వారావివిధ రూపాలలో దేవస్థానంనకు వచ్చిన ఆదాయం.10,51,905 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయకార్యనిర్వాహనాదికారి కె.బి శ్రీనివాసరావు తెలిపారు. అష్టోత్రం ద్వారా రూ 8,200 రూపాయలు, కుంకుమార్చన ద్వారా 24,080రూ, తలనీలాలద్వారా రూ48,525 రూ,వాహన పూజలద్వారా 5,620రూ,ప్రత్యేక దర్శనం ద్వారా 3,00,300రూపాయలు, స్థల పురాణం ద్వారా 1,020రూ, రూము అద్దెలు ద్వారా 24,620రూ,కవర్లు ద్వారా 8,400రూపాయలు, లడ్డూ ప్రసాదం ద్వారా 2,06,125రూపాయలు ,అన్న ప్రసాదముద్వారా 4,13,414 రూపాయలు,ఇతర విరాళాలు 11,601రూపాయలు మొత్తం 10,51,905 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి కె. బి శ్రీనివాసరావు తెలిపారు.అదేవిదంగా ముప్పాళ్ల నరసింహారావు ధర్మపత్ని అనీషా ప్రతి శనివారం జరిగే శాశ్విత అన్నదానం ను ఒక లక్ష నూట పదహారు రూపాయల చెక్కు నుఆలయకార్యనిర్వాహణాధికారి కె.బి.శ్రీనివాసరావు అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img