Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లు

,విశాలాంధ్ర-తాడిపత్రి: జగనన్న ఇల్లు పేదలకు కన్నీళ్లేనని జనసేన న్యూరోగి ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. పెద్దవడుగూరు మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం తాసిల్దార్ కు వినతి పత్రం అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న ఇళ్లు పేదలందరికీ కనీళ్లు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో 2 రోజుల నుంచి టిడ్కో ఇళ్లు,జగనన్న కాలనీలో పర్యటించి ప్రత్యక్షంగా పరిశీలించాము. ఎప్పటికప్పుడు సోషల్, స్థానిక మీడియా ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. ఇందులో భాగంగా 14వ తేదీన సోషల్ ఆడిట్ ని తాడిపత్రి మున్సిపల్ కార్యాలయంలో, పెద్దవడుగురు మండల కార్యాలయంలో అర్జీలు ఇచ్చి టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనీలకు సంబంధించి ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారుల ఎంపికకు అనుసరించిన విధి విధానాలు ఏంటని వాటి వివరాలూ తీసుకోవడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్, పట్టణ ఉపాధ్యక్షులు హర్షద్అయుబ్, ప్రధాన కార్యదర్శి కొండాశివ, రసూల్, రాహూల్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img