Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిక

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని 21వ వార్డు సిద్దయ్య గుట్టలో ఉండు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు మంగళవారం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ పార్టీ కండువా వేసి ఘనంగా ఆహ్వానించారు. పార్టీ చేరిన వారిలో బాబావాలి, భాష, ఖలీల్, మహబూబ్ బాషా, రియాజ్, సాయి, అమీన్ తదితరులు మాట్లాడుతూ నేడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు నచ్చకపోవడంతో, తాము పరిటాల శ్రీరామ్ నాయకత్వములో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. తాము అన్నివేళలా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి తోడ్పడుతామని తెలిపారు. తదుపరి పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ పార్టీ తమకు అన్నివేళలా అండగా ఉంటుందని, పార్టీ కొరకు సైనికుల పనిచేసే మంచి గుర్తింపు పొందాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img