విశాలాంధ్ర- బుక్కరాయసుముద్రం : ఆర్డిటి అనంతపురం జూడో లీగ్ టోర్నమెంట్ శుక్రవారం బుక్కరాయసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగాయి. ఆర్డిటి సౌజన్యంతో జిల్లాను ఎనిమిది గ్రూపులుగా విభజించి జోనల్ లెవెల్ లో జూడో లీగ్ పోటీలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఒక మూడవ జోన్ ను బుక్కరాయసముద్రంలో నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు అంకిరెడ్డి, ఆర్డిటి గ్రాస్ రూట్ కోఆర్డినేటర్ ఓబులేష్, ఎస్ డబ్ల్యూ హాస్టల్ వార్డెన్ రాములు నాయక్, స్టేట్ జూడో అసోసియేషన్ సీఈవో బాబు, ఉపాధ్యాయులు నాగరాజుగౌడ్, పెద్దన్న, నాగరాజు, ఆనంద్, నీలకంఠారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంకిరెడ్డి మాట్లాడుతూ ఆత్మ రక్షణ కోసం ఆడపిల్లలకు ఈ జూడో గేమ్ చాలా ఉపయోగపడుతుందని నిబద్ధతతో ప్రాక్టీస్ చేసిన ఇది చాలా ఉపయోగపడుతుందని స్పోర్ట్స్ కోట కింది కూడా ఉద్యోగాలు పొందవచ్చునని తాను కూడా ఈ విధంగా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం పొందానన్నారు. ఆర్ డి టి గ్రాస్ రూట్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ ఓబులేసు మాట్లాడుతూ ఆర్డిటి లక్ష్యం అందరూ క్రీడల్లో పాల్గొనాలని లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలిపకులు తీయాలని ఆ ఉద్దేశంతోనే ఆర్డిటి ఈ జోనల్ లెవెల్ పోటీలను నిర్వహిస్తున్నదని దీనిని వినియోగించుకుని చక్కటి క్రీడాకారులు తయారు కావాలని ఆకాంక్షించారు. సీఈఓ బాబు మాట్లాడుతూ జూడో క్రీడ కోసం ఆర్డిటి సహాయ సహకారాలు మరువలేనివని సహకారంతోనే ఈ క్రీడా ఇంత అభివృద్ధి చెందిందని కొనియాడారు ప్రత్యేకంగా ఆర్డిటి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రధానోత్సవం చేశారు. బాయ్స్ ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ జెడ్ పి హెచ్ ఎస్ బుక్కరాయసముద్రం, బాయ్స్ సెకండ్ ప్లేస్ ఓవరాల్ ఛాంపియన్షిప్ జెడ్పిహెచ్ఎస్ రుద్రంపేట, గర్ల్స్ ఓవరాల్ ఛాంపియన్షిప్ ఫస్ట్ ప్లేస్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ అనంతపురం, గర్ల్స్ ఓవరాల్ ఛాంపియన్షిప్ సెకండ్ ప్లేస్ శారదా మున్సిపల్ హై స్కూల్, అనంతపురం వ్యాయామ ఉపాధ్యాయులు అన్నపూర్ణ, లక్ష్మీదేవి, విజయలక్ష్మి, సూరి, సుజాత, రెడ్డప్ప, ఆలీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.