Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎమ్మెల్సీ అభ్యర్థి రామగోపాల్ రెడ్డిని గెలిపించండి

విశాలాంధ్ర-రాప్తాడు : టీడీపీ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీడీపీ నాయకులు కోరారు. మాజీ మంత్రి పరిటాల సునీత ఆదేశాల మేరకు బుధవారం బోగినేపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో రాప్తాడు మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, సర్పంచ్ బండి ఉజ్జినప్ప, రాప్తాడు సర్పంచ్ సాకే తిరుపాలు, కురుబ సాధికారిత రాష్ట్ర కన్వీనర్ గంగలకుంట రమణ, బీసీ సెల్ ఆర్గనైజింగ్ ప్రధాన కార్యదర్శి గంగలకుంట కృష్ణ, బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి దండు కేశవ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ముత్యాలు, పెనకలపాటి శివ, నారాయణ కాటమయ్య, నాగప్ప, రమేష్ నాయుడు, గేట్ సత్తి, రామనేపల్లి రాము, బుడగ రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img