Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వృక్ష సంపదను కాపాడుకుందాం


విశాలాంధ్ర- బుక్కరాయసముద్రం: వృక్ష సంపద కాపాడుకుందాం.. మానవాళ్ళ ప్రగతికి మెట్లు అని శ్రీకృష్ణదేవరాయ వ్యవసాయ కళాశాల డీన్ డా బి. రవీంద్రనాథ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం కళాశాల, ఆచార్య ఎన్జీ రంగారావు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం ఎం.బి. పల్లి గ్రామలో నిర్వహించారు. ఈ సందర్భంగా డీన్ మాట్లాడుతూ.. సమాజ అభ్యున్నతకు సేవ స్ఫూర్తితో విద్యార్థులు ముందడుగు వేయాలన్నారు. గ్రామీణ ప్రజల చైతన్య వికాసానికి నాంది పలకాలని సూచించారు.గ్రామ సర్పంచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ. మానవతా లక్షణం. పరస్పర సహకారంగా, పరోపకారంగా, మంచిగా మెలగటమే సమాజ అభ్యున్నతకు కృషి చేయాలన్నారు . ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img