Friday, April 19, 2024
Friday, April 19, 2024

నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయండి

మండల టిడిపి అధ్యక్షులు చిన్న రాముడు

విశాలాంధ్ర – నందవరం : ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, బి వి జయనాగేశ్వర రెడ్డి గారి అధ్యక్షతన ఈ నెల 17వ తేదీన ఎమ్మిగనూరులో జరుగు జాతీయ టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని మండల కన్వీనర్ చిన్నరాముడు అన్నారు. సోమవారం నందవరం మండలంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈనెల 17వ తేదీన ఎమ్మిగనూరు మండలంలోని కోటేకల్ దగ్గర స్వాగతం పలికి బైక్ ర్యాలీగా వచ్చి ఎమ్మిగనూరు పట్టణానికి చేరుకుంటారని, ఎమ్మిగనూరు పట్టణంలో రోడ్ షో నిర్వహిస్తూ సాయంత్రానికి తేరుబజార్ కు చేరుకుంటారని తెలిపారు. తెరుబజర్ లో జరుగు బహిరంగ సభకు భారీ ఎత్తున హాజరై నారా చంద్రబాబు నాయుడు ఎమ్మిగనూరు పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి సెల్ ఉపాధ్యక్షులు ఈరన్న గౌడ్, కర్నూలు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మాధవ రావ్ దేశాయ్, మండల ఉపాధ్యక్షులు ఖాసీం వలి, మాజీ వైస్ ఎంపిపి రఘుమూర్తి స్వామి, మండల బిసి సెల్ అధ్యక్షులు గోపాల్, మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img