Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మా భూములు ఎలాగైనా కాపాడండి.. మల్లేనిపల్లి గ్రామస్తులు

విశాలాంధ్ర -ధర్మవరం : మండల పరిధిలోని మల్లేనిపల్లి గ్రామస్తులు సోమవారం మా భూములు ఎలాగైనా కాపాడాలని కోరుతూ సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి మధు ఆధ్వర్యంలో ఆర్డీవో తిప్పే నాయక్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం మధు మాట్లాడుతూ కొందరు అధికార పార్టీ నాయకుల యొక్క ఆగడాలు భూ దౌర్జన్యాలతో పేదలకు అన్యాయం జరుగుతోందని, అధికారం ఉందని వైసిపి నేతలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పేదల సలాలను భూములను కాజేస్తుండడం దారుణం అన్నారు. సర్వేనెంబర్ 84-3.89.90 లకు నోటీసులు అధికార పార్టీకి చెందిన వెంకటేష్ పంపించడం జరిగింది అని ఎక్కడ విలువైన స్థలాలు కనిపిస్తాయో వాటిపై కన్నేయడం, వాటికి నకిలీ పట్టాలు సృష్టించి అమ్మేయడం లాంటివి ధర్మవరం ఎమ్మార్వో కార్యాలయమే అడ్డగా మారిందని తెలిపారు. దీనివల్ల పేదల తమ స్థలాలను కాజేస్తున్నప్పటికీ వారిని ఎదిరించలేక మిన్నకుండిపోతున్న పరిస్థితి నేడు కలిగిందన్నారు. నకిలీ పట్టాలు సృష్టించి పేదల భూములను ఏదేక్షగా విక్రయిస్తున్న స్థానిక రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నా కూడా అధికార పార్టీ నాయకులకు మద్దతు తెలపడం సమంజసం కాదని వారు తెలిపారు. కావున ఆ సర్వే నెంబర్ పై విచారణ జరిపి మళ్లీ గ్రామస్తులకు న్యాయం చేయవలసినదిగా వారు డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img