Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

మండల సర్వసభ్య సమావేశం

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు .సమావేశంలో వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలను సభ్యులకు వివరించారు. మాండూస్ తుఫానుతో పంటలు దెబ్బతిన్న రైతులకు కోటి పది లక్షలు పరిహారం ఇప్పటికే రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని మండల వ్యవసాయ అధికారి వెంకట్రావు వివరించారు ఇప్పటికే పలు గ్రామాల్లో సెనగ, వరి పంటల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. సమావేశంలో జడ్పిటిసి యాదల రత్నభారతి, ప్రత్యేక అధికారి ఎం అంజల, ఎంపీడీవో ఏవివీ కుమారి ఎంపీటీసీలు సర్పంచులు మండల పరిషత్ సభ్యులు పాల్గొన్నారు.

వ్యవసాయ శాఖ నివేదికను వివరిస్తున్న ఏవో వెంకటరావు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img