Friday, April 19, 2024
Friday, April 19, 2024

జగనన్న ఆణిముత్యాలకు పురపాలక విద్యార్థిని ఎంపిక…

హెచ్ఎం. మేరీ వర కుమారి
విశాలాంధ్ర -ధర్మవరం : ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యారంగంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు చేయూతగా జగనన్న ఆణిముత్యాలు ప్రవేశపెట్టింది.. ఇందులో భాగంగా పట్టణంలోని కొత్తపేటలో గల పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో ఇటీవల పదవ తరగతి పరీక్షలో ప్రతిభ ఘనపరిచి అత్యున్నత మార్కులతో టీ. ముబసీర 584/600 సాధించి, జగనన్న ఆణిముత్యాలకు ఎంపిక కావడం జరిగిందని పాఠశాల హెచ్ఎం మేరీ వర కుమారి బుధవారం పేర్కొన్నారు. ఎంపికైన వారికి ప్రభుత్వమే వారి బ్యాంకు ఖాతాలో నగదు పారితోషకాన్ని జమ చేయడం జరుగుతుందని హెచ్ఎం తెలిపారు. అనంతరం హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు, పాఠశాల కమిటీ ఆ విద్యార్థిని అభినందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img