Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

సాంకేతిక ప్రగతి ప్రదాత నెహ్రూ          

ఉపకులపతి జింక రంగా జనార్ధన్  

   విశాలాంధ్ర – జెఎన్టియుఏ: సాంకేతిక  రంగాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించిన ప్రగతి ప్రదాత జవహర్లాల్ నెహ్రూని అని ఉపకులపతి ఆచార్య జింక రంగ జనార్ధన్ పేర్కొన్నారు. సోమవారం నెహ్రూ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఇంజనీరింగ్ కళాశాలలో ఉపకులపతి, రెక్టర్ విజయ్ కుమార్, రిజిస్ట్రార్ సి. శశిధర్, కళాశాల ప్రిన్సిపల్ పి. సుజాత  ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
     ఈ సందర్బంగా  ఉపకులపతి  మాట్లడుతూ .. పరిశోదనాత్మకంగా ఆలోచించినప్పుడు నవ్య విష్కరణలకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో   భువన విజయ,  విశాలి,  సుబ్బారెడ్డి, ఈశ్వర్ రెడ్డి , ఆచార్య చంద్ర మోహన్ రెడ్డి ,  డాక్టర్ మాధవి, డాక్టర్ విష్ణు వర్ధన్, డాక్టర్ దిలీప్,  కళ్యాణి రాధ, డిప్యూటీ రిజిస్ట్రార్ రంగనాయక్, అసిస్టెంట్ రిజిస్టర్ నాగభూషణం, ఏఆర్ లు, బోధన, బోధనేతర  సిబ్బంది పాల్గొన్నారు.       

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img