Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎన్ ఎస్ ఎస్ అవగాహనా సదస్సు

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని శ్రీ సత్యసాయి కృప డిగ్రీ కళాశాలలో మంగళవారం డాక్టర్ భాస్కర్ నాయుడు పర్యావరణవేత్త ఐ హెచ్ ఆర్ సి సభ్యులచే ఎన్ ఎస్ ఎస్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఎన్ఎస్ఎస్ పై పలు విషయాలను తెలియజేస్తూ,శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు విద్యార్థులకు ప్రకృతి పరిరక్షణ వారి బాధ్యతలు గుర్తు చేయడం జరిగిందని, ప్రకృతి వల్ల కలిగే లాభనష్టాల గురించి తెలియజేయడం, ప్రకృతి పరిరక్షణలో మీ వంతు బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి పరిరక్షణ కోసం ఎన్ని వేల కోట్లు వెచ్చిస్తున్నారు అని తెలిపారు. రాజస్థాన్లోని కార్ ఎడారి చిరపుంజి వీటి మధ్య తేడా జీవన విధానంలో తేడా అదేవిధంగా ఫారెస్ట్ అన్న ఆరు అక్షరాల గురించి. ఫుడ్ ఆక్సిజన్ రైన్స్,ఎకో బ్యాలెన్స్, సాయిల్ కన్జర్వేషన్, టెంపరేచర్ బ్యాలెన్స్ ,అండ్ టింబర్ గురించి పూర్తిగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా తెలియజేయడం జరిగిందన్నారు. దేశంలో రెండవ కరువు జిల్లా గా ఉన్న ఉమ్మడి అనంతపురం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేలకోట్ల రూపాయలు కరువు నివారణ కోసం వెచ్చిస్తూనే ఉన్నారు కానీ ఫలితం శూన్యం అని తెలిపారు.ఈ విషయంపై విద్యార్థులు పరిజ్ఞానం కలిగి ఉండాలనీ, జిల్లాలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసం, అడవులు తగలబడడం, అక్రమంగా చెట్లు నరికి సామిల్లులకు ఇటుక బట్టీలకు, బొగ్గు బట్టీలకు, పరిశ్రమలకు ,పక్క రాష్ట్రాలకు కరువు జిల్లా నుండి చెట్లు నరికి వినియోగించడం ఎంతో దారుణమైన విషయం అని, ఈ విషయాన్ని కొంతమంది అధికారులు సహకారం వల్ల జరుగుతూ ఉంది అన్నారు. ఈ దారుణాన్ని మీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆపాలి లేకపోతే రాబోవు కాలంలో పరిస్థితులు మరోలా ఉంటాయని చైతన్య పరచడం జరిగిందన్నారు.. కరువు జిల్లాలో ఎక్కడ చెట్లు నరికినా ప్రశ్నించాలని అనుమతి పత్రం చూపించాలని, తరువాత మాత్రమే చెట్లు నరకవచ్చని లేనిపక్షంలో ఆ వృక్షాలను కాపాడాలని మీ బాధ్యతగా తీసుకునే విధంగా విద్యార్థులకు అవగాహన కలిగించడం అలాగే విద్యార్థులకు హ్యూమన్ రైట్స్ సంస్థలో చేరుటకు సభ్యత్వం అప్లికేషన్ అందించడం జరుగుతుందన్నారు.ఇంట్రెస్ట్ ఉన్నవారు ప్రకృతికి మేలుచెయ్యాలిఅని, అన్నభావం ఉన్నవారు మాతోకలిసిరండి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ పెద్ది రెడ్డి ,జిల్లా అధ్యక్షులు షేక్షావలి, ధర్మవరం జనరల్ సెక్రెటరీ మాస్టర్ హరికృష్ణ, కళాశాల ఎన్ఎస్ఎస్ కరస్పాండెంట్ సిబ్బంది, పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img