Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన వన్టౌన్ సిఐ, ట్రాఫిక్ సిఐలు

విశాలాంధ్ర – ధర్మవరం : ఈనెల 13వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా పట్టణంలోని పలు పోలింగ్ కేంద్రాలను వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ సుబ్రహ్మణ్యం, ట్రాఫిక్ సిఐ వహీద్ భాషాలు శనివారం తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా వారు పర్యవేక్షించారు. తదుపరి పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు తదితర వాటిని కూడా పరిశీలించడం జరిగిందని వారు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. పట్టపద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటును ఎవరి ప్రలోభాలకు గురికాకుండా ఓటును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పోలింగ్ రోజున ఎవరైనా గొడవలు సృష్టిస్తే, ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించేది లేదని వారిపై కఠిన చర్యలతో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img