Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దోమల నివారణకు పాగింగ్

ఉరవకొండ కార్యదర్శి గౌస్ సాహెబ్

విశాలాంధ్ర :ఉరవకొండ – ఉరవకొండ గ్రామపంచాయతీ పరిధిలో వివిధ వార్డులలో దోమల నివారణకు పాగింగ్ చేసినట్లు గ్రామ పంచాయతీ కార్యదర్శి గౌస్ సాహెబ్ తెలిపారు. బుధవారం రాత్రి అంబేద్కర్ నగర్ తో పాటు వివిధ వార్డులలో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. గ్రామ సర్పంచ్ తో పాటు వివిధ వార్డు సభ్యులు విజ్ఞప్తి మేరకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా దోమల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని ఇంటి పరిసరాలు చుట్టూ నీరు నిలువ ఉండకుండా చూడాలని తెలిపారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా టైఫాయిడ్, విషజ్వరాలు వ్యాపించే ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img