డిఈఈ.. నాగేంద్ర
విశాలాంధ్ర – ధర్మవరం : నియోజకవర్గంలోని తాడిమర్రి 33 కెవి ఫీడర్ లో మరమ్మత్తులు ఉన్న కారణంగా శనివారం ఉదయం 8:30 నుండి 11:30 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని విద్యుత్ శాఖ డీఈఈ నాగేంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం మాట్లాడుతూ పట్టణంలోని శివానగర్, నే సేపేట, చెన్నూరు రోడ్డు, శాంతినగర్, శారద నగర్, చంద్రబాబు నగర్, కదిరి గేటు, గోట్లురు, ముదినేపల్లి, తిప్పేపల్లి, తుమ్మల, నాగలూరు, తదితర చోట్ల మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని వారు తెలిపారు. కావున ప్రజలు సహకరించాలని వారు తెలిపారు.