Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ నియామకాలు

జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ఇండో ఎం ఐ ఎం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మెకానికల్ విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు నిర్వహించారు. 45 మంది బీ.టెక్ మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు రాత పరీక్ష లో పాల్గొనగా వారిలో 21 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. త్వరలోనే కంపెనీకి ఎంపికైన ప్రతిభవంతుల జాబితాను కంపెనీ వెల్లడిస్తారని కళాశాల ప్రిన్సిపల్ పి. సుజాత పేర్కొన్నారు. ఈ సందర్బంగా . రెక్టార్ ఆచార్య ఎం. విజయ్ కుమార్ , రిజిస్ట్రార్ ఆచార్య సి. శశిధర్ .. మాట్లాడుతూ .. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. అనంతరం రెక్టర్ కార్యాలయంలో నియామకాలపై ప్రణాళిక కార్యచరణ మొదలగు అంశాలపై కళాశాల ప్రిన్సిపల్, ఐ పి ఆర్ వి. సుమలత తో రెక్టర్, రిజిస్ట్రార్ సమీక్షించారు. కంపెనీ ప్రతినిధి హరీష్ , హెచ్ ఆర్ బిందు , మాధవ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img