Friday, April 19, 2024
Friday, April 19, 2024

నరసింహ స్వామికి వెండి పూలహారం బహుకరణ

విశాలాంధ్ర -ఉరవకొండ: అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరవకొండ మండలం పెన్నహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా తల మామిడి గ్రామానికి చెందిన భక్తుడు తలారి రామకృష్ణ 19 వేల రూపాయల విలువ చేసే 210 గ్రాముల వెండితో తయారు చేయించిన పులహారాన్ని బహుకరించారు. శనివారం ఆలయ కార్యనిర్వాహణ అధికారి విజయ్ కుమార్, అర్చకులు ద్వారకానాథ్,మయూరం బాలాజీ లకు అందజేశారు. ఈ సందర్భంగా వెండి పూలహారాన్ని స్వామివారి మూల విరాట్ కు అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం దాత రామకృష్ణ ను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.తీర్థప్రసాదాలు అందజేసారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మారుతీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img