విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సీతారామయ్య బాలికల జూనియర్ కళాశాలలో సోమవారం ఆర్ డి టి సెట్ పరీక్షలు సజావుగా జరిగాయని ఆర్డిటి రీజినల్ డైరెక్టర్.. ప్రమీల కుమారి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివిన విద్యార్థులకు ఈ ఆర్డిటి సెట్ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, ఈ పరీక్షల్లో ప్రతిభ ఘనపరిచిన విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను అందించడం జరుగుతుందని వారు తెలిపారు. తదుపరి ఇటువంటి పరీక్షలు మా కళాశాలలో నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని కరెస్పాండెంట్ సీతారామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టిఎల్ సురేంద్ర కృష్ణ,ఏటిఎల్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.