విశాలాంధ్ర-రాప్తాడు : ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు.. ఉదయం 10 గంటల సమయంలో అనంతపురం వైపు నుండి ఒక ద్విచక్ర వాహనంలో డీఆర్డీఏ స్కిల్ డెవలప్మెంట్ విభాగంలో పని చేసే దినేష్, రోజా ఇద్దరూ వెళుతున్నారు. పంగల్ రోడ్ వైపు నుండి Aూ02ుజు 2790 టిప్పర్ ను దాని డ్రైవర్ రాప్తాడు వై జంక్షన్ వద్ద అనంతపురం వైపు మలుపు తిప్పుతూ బైక్ ను ఢీకొట్టగా వారికి తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు వెంటనే గాయాలతో ఉన్న ఇద్దరినీ
108 అంబులెన్సు లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాలైన చిలమత్తూరుకు చెందిన కిష్టప్ప కూతురు రోజా (25) చికిత్స పొందుతూ మరణించినది. ఇక గుంతకల్లు మండలం నాగముద్రం గ్రామానికి చెందిన గురుస్వామి కుమారుడు ఈడిగ దినేష్ ను మెరుగైన చికిత్స కోసం బెంగళూరు కు తరలించారన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామన్నారు.