Friday, April 19, 2024
Friday, April 19, 2024

సరస్వతి పూజ

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు సోమవారం పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు సరస్వతీ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర్ సహ ప్రధాన ఉపాధ్యాయులు వేణుగోపాలచార్యులు పాల్గొని విద్యార్థులు క్రమ శిక్షణ కలిగిన విద్యను అభ్యసించాలని అన్నిటికంటే తమ యొక్క ప్రవర్తనను సక్రమ మార్గంలో ఉంచుకున్నప్పుడు విద్యార్థులు అత్యున్నత స్థాయి ఎదగడానికి మార్గము సుగమవుతుందని మన కన్న తల్లిదండ్రుల యొక్క ఉపాధ్యాయుల యొక్క ఆశయాలు నెరవేర్చడానికి ఒక దిశ నిర్దేశంలో ప్రయాణించవలసి ఉంటుందని విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించారు అనంతరం వారందరికీ ఏప్రిల్ మూడో తారీకు నుంచి జరిగే పదవ తరగతి పరీక్షల హాల్ టికెట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట శ్రీనివాసులు అక్కమ్మ గిరిజమ్మ చాంద్ బాషా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img