Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సేవా భావమే మా లక్ష్యం.. శ్రీ సత్య సాయి సేవ సమితి నిర్వాహకులు

విశాలాంధ్ర -ధర్మవరం : సేవా భావమే మా లక్ష్యమని శ్రీ సత్య సాయి సేవా సమితి నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 360 మంది రోగులకు సహాయకులకు భోజనపు ప్యాకెట్లను ఆసుపత్రి వైద్యులు, నర్సుల చేతుల మీదుగా అందజేశారు. తదుపరి గర్భిణీ స్త్రీలకు భోజనంతో పాటు స్వీట్లు కూడా పంపిణీ చేశారు. ఇటువంటి కార్యక్రమాలు పుట్టపర్తి భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో నడపడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమానికి సేవ దాతగా కాకి అయాన్ సాయి, మణికంఠలు నిర్వహించారని తెలిపారు. తదుపరి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పద్మలత, ఆసుపత్రి వైద్యులు,నర్సులు, సిబ్బంది శ్రీ సత్య సాయి సేవా సమితి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొత్తం 17 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొనడం జరిగిందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img