Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శిగా.. ఎం. నరేంద్ర ఎంపిక

విశాలాంధ్ర – ధర్మవరం: ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యదర్శిగా ఎం.నరేంద్రను ఎంపిక చేసినట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ ఎనుముల పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ప్రెస్ క్లబ్ లో ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ విద్యా పరంగా పరిష్కారాలు రాష్ట్ర ప్రభుత్వం విద్యను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ఆయన మండిపడ్డారు. నేడు రాష్ట్రంలో జరుగుతున్న విద్యా విధానమును వారు పూర్తిగా వ్యతిరేకించారు. విద్యార్థుల సమస్యలపై ఎన్ ఎస్ యు ఐ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం నరేంద్ర మాట్లాడుతూ నూతన విద్యా విధానాలు అమలు చేయాలని చేస్తున్న ఈ ప్రభుత్వ విధానాన్ని కూకటి వేళ్లతో సహా పెకలించాలని ఇందుకు తాను అందరి సహాయ సహకారాలతో నిరంతరం పోరాటాలు సలుపుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మారం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రంగన అశ్వత్థ నారాయణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రసాద్, ఎం ఎస్ వై పట్టణ అధ్యక్షులు చైతన్య, నాయకులు సురేష్, గణేష్, గిరీష్ ,వేణు, మనోహర్ తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img