Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

రోగులకు సేవలు చేయడం దైవ సేవతో సమానం

శ్రీ సత్య సాయి భజన మండలి నిర్వాహకులు

విశాలాంధ్ర – ధర్మవరం : ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు సేవలు చేయడం దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి భజన మండలి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గల రోగులకు బ్రెడ్ పాలు బిస్కెట్లను పంపిణీ చేయడం జరిగిందని వారు తెలిపారు. కొత్తపేట కు చెందిన శివయ్య ఆచారి దాతగా వ్యవహరించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి లోని రోగులకు, వారి సహాయకులకు, అల్పాహారం, ఉపహారం ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ పంపిణీ కార్యక్రమానికి దాతలుగా ఎంతోమంది ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఇది నిరంతర ప్రక్రియగా నిర్వహించడం జరుగుతుందని, ప్రతి గురువారం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని దాతలు కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ పద్మలత సత్యసాయి భజన మండలి వారికి దాతలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img