Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సత్యసాయి జిల్లా యుటిఎఫ్ అధ్యక్షులుగా శెట్టిపి జయ చంద్రారెడ్డి


విశాలాంధ్ర – ధర్మవరం : శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులుగా ధర్మవరం పట్టణానికి చెందిన శెట్టిపి జయ చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఇటీవల పెనుకొండ పట్టణంలోని రవీంద్ర భారతి స్కూల్ ఆవరణంలో జరిగిన ప్రథమ జిల్లా కౌన్సిల్ సమావేశం నందు జయ చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల కొరకు యుటిఎఫ్ రాజీలేని పోరాటాలు కొనసాగిస్తుందని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్ డిఎల ను వెంటనే ప్రభుత్వం మంజూరు చేయాలని, యాపుల భారం తగ్గించాలని, ఉపాధ్యాయులను కేవలం బోధనకే పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఉమ్మడి జిల్లా యుటిఎఫ్ అధ్యక్షులుగా, ఉమ్మడి జిల్లా ఫ్యాప్టో చైర్మన్గా పనిచేసిన జయ చంద్ర రెడ్డి.. ఇప్పుడు శ్రీ సత్య సాయి జిల్లా యుటిఎఫ్ అధ్యక్షులుగా ఎన్నిక పట్ల ధర్మవరం జోన్ నాయకులు రామకృష్ణ నాయక్, లక్ష్మయ్య, హరికృష్ణ, బిల్లే రామాంజనేయులు, రాంప్రసాద్,గోపాల్ రెడ్డి, మల్లేష్,వినయ్ కుమార్, ఆదిరెడ్డి, అమర్ నారాయణరెడ్డి లక్ష్మీనారాయణ, అమర్నాథ్ రెడ్డి వేణుగోపాల్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img